BREAKING
అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ
www.ntodaynews.com

సైబర్ నేరాలపై, అప్రమత్తంగా ఉండాలి : రామన్నపేట ఎస్సై డి. నాగరాజు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 08:23 PM
86 వీక్షణలు

సైబర్ నేరాలు, అప్రమత్తంగా ఉండాలి : రామన్నపేట ఎస్సై డి. నాగరాజు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రామన్నపేట ఎస్సై డి. నాగరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామస్తులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయవద్దని ఎస్సై సూచించారు. అంతేకాకుండా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరించారు. ​మహిళలు మరియు చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ, చిన్నారుల రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరారు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. చైన్ స్నాచింగ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యతను వివరించారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి అని తెలిపారు.


 ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నరసింహ, సురేష్, మధులతో పాటు గ్రామ పెద్దలు, యువత మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.