సదుం బిజేపి మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులు...
సదుం బిజేపి మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులు...
అన్నమయ్య జిల్లా.
సదుం/పుంగనూరు.
స్థానిక ఎన్నికలే లక్ష్యం.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి - జగదీష్ రాజు
పుంగనూరు నియోజకవర్గం
సదుం మండల సమావేశం సదుంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు సదుం మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులును అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ,రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు.అలాగే కొత్త సభ్యులను పార్టీలోకి ఆహ్వానిస్తూ,యువతను ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వనాథ నాయుడు,గన్న మదన్ మోహన్,సీనియర్ నాయకులు దొరస్వామి,అశోక్ రెడ్డి తదితర పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.