www.ntodaynews.com
సీబీఐ డైరెక్టర్కు మరో ఏడాది పొడిగింపు
జాతీయం
కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్గా కొనసాగుతున్న ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది.
ఈనెల 24తో ఆయన పదవీ గడువు ముగియాల్సి ఉండగా.. తాజా ఉత్తర్వులతో 2027 మే వరకు కొనసాగనున్నారు. 2023లో సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్కు పదవీకాలం పొడిగించడం ఇది రెండోసారి.
కొత్త డైరెక్టర్ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపిక ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.