www.ntodaynews.com
సీఎం అయినా నేను మారలేదు.. నా జీవన విధానం మారలేదు: రేవంత్ రెడ్డి
తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవి మారినా, వ్యక్తిత్వం మాత్రం మారలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచే ఉన్న నడత, నడకే ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, నిద్రలో కూడా రాష్ట్ర బాధ్యతలను మర్చిపోనని పేర్కొన్నారు. గత 30 నెలలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు.
అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైన నిధులు, అనుమతులు సాధించేందుకు తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.