BREAKING
నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి
www.ntodaynews.com

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 03:33 PM
106 వీక్షణలు

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నప్పటికీ, వాటి భద్రత మాత్రం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2,868 ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మెన్లు లేకపోవడంతో వేసవి సెలవుల సమయంలో హెడ్‌మాస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పాఠశాలల్లోని ఫ్యాన్లు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనానికి గురైతే సంబంధిత హెచ్‌ఎంలనే బాధ్యులుగా విద్యాశాఖ పరిగణిస్తోంది. దీంతో సెలవుల్లో కూడా పలువురు హెచ్‌ఎంలు పాఠశాలల వద్దే పహారా కాస్తున్నారు.

ఆస్తులు పోతే రికవరీ నోటీసులు వస్తాయనే భయంతో కొందరు ప్రధానోపాధ్యాయులు స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తుండగా, మరికొందరు సొంత ఖర్చులతో ప్రైవేట్ వ్యక్తులను కాపలా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాల ఆస్తుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.