BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 03:33 PM
42 వీక్షణలు

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నప్పటికీ, వాటి భద్రత మాత్రం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2,868 ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మెన్లు లేకపోవడంతో వేసవి సెలవుల సమయంలో హెడ్‌మాస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పాఠశాలల్లోని ఫ్యాన్లు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనానికి గురైతే సంబంధిత హెచ్‌ఎంలనే బాధ్యులుగా విద్యాశాఖ పరిగణిస్తోంది. దీంతో సెలవుల్లో కూడా పలువురు హెచ్‌ఎంలు పాఠశాలల వద్దే పహారా కాస్తున్నారు.

ఆస్తులు పోతే రికవరీ నోటీసులు వస్తాయనే భయంతో కొందరు ప్రధానోపాధ్యాయులు స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తుండగా, మరికొందరు సొంత ఖర్చులతో ప్రైవేట్ వ్యక్తులను కాపలా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాల ఆస్తుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.