BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

సెప్టెంబర్ 17 నాటికి ఇందిరమ్మ ఇళ్ల పూర్తి.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:38 PM
30 వీక్షణలు

హైదరాబాద్, జులై 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఫేజ్-1 కింద మంజూరైన 2.50 లక్షల ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని హౌసింగ్ శాఖకు స్పష్టమైన గడువు విధించింది.

ఇప్పటికే గోడలు, స్లాబ్ దశ వరకు చేరుకున్న ఇళ్ల నిర్మాణాన్ని ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించింది.

ఇదిలా ఉండగా, ఫేజ్-2లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఇప్పటివరకు 37 వేల దరఖాస్తులను సర్వే చేయగా, అందులో సుమారు 5 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా అమలు చేస్తోందని, నిర్దేశిత గడువులోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హౌసింగ్ శాఖ అధికారులు తెలిపారు.