BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

సెప్టెంబర్ 17 నాటికి ఇందిరమ్మ ఇళ్ల పూర్తి.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:38 PM
55 వీక్షణలు

హైదరాబాద్, జులై 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఫేజ్-1 కింద మంజూరైన 2.50 లక్షల ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని హౌసింగ్ శాఖకు స్పష్టమైన గడువు విధించింది.

ఇప్పటికే గోడలు, స్లాబ్ దశ వరకు చేరుకున్న ఇళ్ల నిర్మాణాన్ని ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించింది.

ఇదిలా ఉండగా, ఫేజ్-2లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఇప్పటివరకు 37 వేల దరఖాస్తులను సర్వే చేయగా, అందులో సుమారు 5 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా అమలు చేస్తోందని, నిర్దేశిత గడువులోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హౌసింగ్ శాఖ అధికారులు తెలిపారు.