www.ntodaynews.com
ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
బిషప్ రాజారావును కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ:
ఈస్టర్ పండుగ ను పురస్కరించుకొని విజయవాడ నగరంలో పలువురు క్రైస్తవ మత పెద్దలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్( చిన్ని) ఆదివారం కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
పడమట లోని నిర్మల కాన్వెంట్ పక్కన ఉన్న ఆర్.సి.యం చర్చ్ బిషప్ హౌస్ లో బిషప్ తెలగతోటి రాజారావు ను ఎంపీ కేశినేని చిన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు ప్రజా శ్రేయస్సు కోసం ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు మువ్వల ప్రసాద్, క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు ఇత్తడి విక్టర్ చార్లెస్ చాట్ల రాజశేఖర్, నాయకులు నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు.