BREAKING
ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం
www.ntodaynews.com

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 08:57 PM
27 వీక్షణలు

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

రూ.1.05 కోట్ల నగదు.. కేజీ బంగారం స్వాధీనం

హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు.. నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి గుర్తింపు

రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు అనుమానం

సికింద్రాబాద్‌లోని మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.1.05 కోట్ల నగదు, సుమారు కేజీ బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల ప్రాథమిక విచారణలో నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ నగరంలో 9 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.