BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 08:57 PM
121 వీక్షణలు

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

రూ.1.05 కోట్ల నగదు.. కేజీ బంగారం స్వాధీనం

హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు.. నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి గుర్తింపు

రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు అనుమానం

సికింద్రాబాద్‌లోని మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.1.05 కోట్ల నగదు, సుమారు కేజీ బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల ప్రాథమిక విచారణలో నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ నగరంలో 9 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.