సికింద్రాబాద్లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు
సికింద్రాబాద్లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు
రూ.1.05 కోట్ల నగదు.. కేజీ బంగారం స్వాధీనం
హైదరాబాద్లో 9 ఫ్లాట్లు.. నిజామాబాద్లో 3 ఎకరాల భూమి గుర్తింపు
రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు అనుమానం
సికింద్రాబాద్లోని మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.1.05 కోట్ల నగదు, సుమారు కేజీ బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల ప్రాథమిక విచారణలో నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ నగరంలో 9 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.