www.ntodaynews.com
సింగరేణిపై లెక్కలకు సిద్ధమా: హరీశ్ రావుకు భట్టి విక్రమార్క సవాల్
తెలంగాణ
మంచిర్యాలలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సింగరేణి విషయంపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు.
దేశంలో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థ దోపిడీకి గురైందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు రోజుకో అబద్ధంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.