సిరికొండలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు
సిరికొండలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎస్సై సతీష్
పాల్గొన్న సర్పంచ్ ధర్మరాజు యాదవ్ మరియు పాలకవర్గం
బుగ్గారం (సిరికొండ), ఏప్రిల్ 14:
బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు బుగ్గారం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై సతీష్, గ్రామ సర్పంచ్ పంచిత ధర్మరాజు యాదవ్, ఉప సర్పంచ్ మరియు కార్యదర్శితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.