BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:27 PM
140 వీక్షణలు

స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా

ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐసీసీటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్రంలో 1,50,000 మందికి ఉపాధి కల్పిస్తున్న వంట ఏజెన్సీలను తొలగించి, స్మార్ట్ కిచెన్ సెంటర్లకు బడా కాంట్రాక్టర్లకు అప్పగించడానికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్న విషయం ప్రస్తావించబడింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య, దుర్గం పుల్లారావు నాయకత్వంలో కార్మికులు పోరాడారు.

అంతే కాకుండా, నోయిడాలో కనీస వేతనాలు ఇవ్వాలని, వారాంతపు సెలవు మంజూరు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, అదనపు శ్రమకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసిన 400 మంది పై అక్రమ కేసులు పెట్టిన విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వారు చేసిన పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ, కనీస వేతనం 36 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలనీ, ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో పెద్ద ఎత్తున మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరై, కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ, అమిత్ షా మానుకోవాలని, లేకుంటే కార్మిక నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వారు ఉత్తరప్రదేశ్లో కూడా మల్టీ నేషనల్ కంపెనీలపై నిరసన తెలిపారు, అక్కడ కూడా కనీస వేతనాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరికల కళావతి, భవాని మేకల కుమారి, సీతామాలక్ష్మి, భూతం మారయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా, సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు