BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఇసుక బుకింగ్‌లు

తెలంగాణ
24 Jan, 2026 - 08:25 PM
376 వీక్షణలు
ఇసుక కావాలంటే ‘మన ఇసుక వాహనం’ యాప్ తప్పనిసరి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఇసుక బుకింగ్‌లు NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి – లక్ష్మణ్ కరీంనగర్ కలెక్టరేట్, రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, సామాన్యులకు పారదర్శకంగా ఇసుక అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఇసుక బుకింగ్‌లు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతాయని Telangana State Mineral Development Corporation (TGMDC) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ Pamela Satpathy, నగర పోలీస్ కమిషనర్ Gauss Alamతో కలిసి అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘మన ఇసుక వాహనం’ యాప్ ప్రారంభం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఇసుక పొందేందుకు ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్ను ప్రవేశపెట్టిందని తెలిపారు. బుకింగ్ విధానం: స్మార్ట్ ఫోన్ ఉన్నవారు యాప్ లేదా TGMDC వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్రత్యామ్నాయం: స్మార్ట్ ఫోన్ లేనివారు గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా బుకింగ్ చేయించుకోవచ్చు నిబంధన: మాన్యువల్ రసీదులు పూర్తిగా రద్దు, కేవలం ఆన్‌లైన్ రసీదుల ద్వారానే రవాణా ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ప్రత్యేకంగా యాప్‌లో ఆప్షన్ కల్పించామని, ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉచితంగా అందిస్తామని భవేశ్ మిశ్రా వెల్లడించారు. నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు మొదటి దశలో కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఫలితాలను పరిశీలించిన తరువాత రాష్ట్రంలోని మిగిలిన 16 జిల్లాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. సమన్వయంతో అమలు చేయాలి: కలెక్టర్ జిల్లాలో ఈ విధానం విజయవంతం కావడానికి రెవెన్యూ, పోలీస్, రవాణా, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వచ్చే 15 రోజుల్లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, తహశీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మైనింగ్ శాఖ అధికారులు జయరాజ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. #ManaIsukaVahanam #SandBookingOnline #TGMDC #TelanganaGovernment #TransparentGovernance #IndirammaHouses #Karimnagar #DigitalServices #SandPolicy #PublicServices Follow us on Website Facebook Instagram YouTube