సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని సందర్బంగా రక్తదానం
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదానం చేసిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు
ఈరోజు మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న జనని బ్లడ్ బ్యాంకులో పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదానం చేసిన జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రామగిరి రాజన్న చారి, అశోక్ వేముల రక్తదానం చేయగా బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే ఈ సంస్థలో బహుజనులు అధిక శాతం ఉన్నామని ఈ సంస్థానాన్ని మేమే ఏలాలని కాకతీయులపై తిరుగుబాటు చేసి సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్న గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను స్ఫూర్తిగా తీసుకొని రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పనిచేయాలని కోరుతూ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఆయన జీవితం గూర్చి పాఠ్య అంశాల్లో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అలాగే 33 సంస్థానాల పై తిరుగుబాటు చేసి 33 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప పోరాట యోధుడిని స్మరించుకోవలసిన బాధ్యత బీసీలుగా మన పైన ఎంతైనా ఉంది అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,నాయకులు వేముల అశోక్,రామగిరి రాజన్న చారి, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు