BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

స్టాక్ మార్కెట్‌లో నేటి నుంచి కొత్త టైమింగ్స్.. ట్రేడర్లకు కీలక మార్పులు!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:53 PM
24 వీక్షణలు

స్టాక్ మార్కెట్‌లో నేటి నుంచి కొత్త టైమింగ్స్.. ట్రేడర్లకు కీలక మార్పులు!

ముంబై, ఆగస్టు 3: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ విధానంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు నేటి (ఆగస్టు 3) నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) స్టాక్స్‌లో ట్రేడింగ్, క్లోజింగ్ ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇప్పటి వరకు F&O స్టాక్స్‌లో రెగ్యులర్ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకు ముగిసేది. ఇకపై అదే సమయంలో ప్రత్యేక క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) ప్రారంభమై మధ్యాహ్నం 3:35 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సెషన్‌లో కొనుగోలు, అమ్మకాల ఆధారంగా నిర్ణయించే ధరనే ఆ రోజు అధికారిక ముగింపు ధరగా పరిగణిస్తారు.

అదేవిధంగా F&O ట్రేడింగ్ సమయాన్ని మరో 10 నిమిషాలు పొడిగించి సాయంత్రం 3:40 గంటల వరకు కొనసాగించేలా మార్పులు చేశారు. దీంతో ట్రేడర్లకు చివరి దశలో లావాదేవీలు పూర్తి చేసుకునేందుకు అదనపు సమయం లభించనుంది.

అయితే నాన్-F&O ఈక్విటీ క్యాష్ స్టాక్స్‌కు ఎలాంటి మార్పులు లేవు. వాటి ట్రేడింగ్ యథావిధిగా మధ్యాహ్నం 3:30 గంటలకే ముగుస్తుంది.

మార్కెట్ ముగింపు ధర మరింత పారదర్శకంగా నిర్ణయించేందుకు, ధరల్లో చివరి నిమిషాల్లో వచ్చే హెచ్చుతగ్గులను తగ్గించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.