www.ntodaynews.com
స్వయంగా రంగంలోకి దిగిన దీదీ
జాతీయం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ హింస, విధ్వంస ఘటనలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మాజీ సీఎం మమతా బెనర్జీ స్వయంగా కలకత్తా హైకోర్టులో రంగంలోకి దిగారు. రాజకీయంగా సున్నితమైన ఈ వ్యవహారంలో న్యాయపరంగా తన వాదనలను ప్రత్యక్షంగా వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ నేతలు ఎన్నికల తర్వాత హింస, దాడులు జరిగాయని ఆరోపిస్తూ పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ స్వయంగా కోర్టులో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.