కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి, భర్త మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, బడుగు బలహీన వర్గాల పేద మహిళల కోసం పాఠశాలలు స్థాపించి ఉచిత విద్య అందించిందని తెలిపారు. అలాగే బాల్యవివాహాలను అరికట్టడం, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, అసమానతలు, అంటరానితనం, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు విశేషంగా కృషి చేసిందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. చివరికి ప్లేగు వ్యాధితో బాధపడుతున్నవారికి సేవ చేస్తూ అదే వ్యాధితో ఆమె మరణించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం అమర్నాథ్తో పాటు ఉపాధ్యాయులు నాగమల్లిక, మనోహర్, రామాంజులు, ప్రేమకుమార్, భాస్కర్, శ్రీనివాసులు, ప్రసూన మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube