BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

తెలంగాణ
03 Jan, 2026 - 07:07 AM
102 వీక్షణలు

కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి, భర్త మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, బడుగు బలహీన వర్గాల పేద మహిళల కోసం పాఠశాలలు స్థాపించి ఉచిత విద్య అందించిందని తెలిపారు. అలాగే బాల్యవివాహాలను అరికట్టడం, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, అసమానతలు, అంటరానితనం, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు విశేషంగా కృషి చేసిందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. చివరికి ప్లేగు వ్యాధితో బాధపడుతున్నవారికి సేవ చేస్తూ అదే వ్యాధితో ఆమె మరణించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం అమర్నాథ్‌తో పాటు ఉపాధ్యాయులు నాగమల్లిక, మనోహర్, రామాంజులు, ప్రేమకుమార్, భాస్కర్, శ్రీనివాసులు, ప్రసూన మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube