BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

తెలంగాణ
03 Jan, 2026 - 07:07 AM
161 వీక్షణలు

కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి, భర్త మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, బడుగు బలహీన వర్గాల పేద మహిళల కోసం పాఠశాలలు స్థాపించి ఉచిత విద్య అందించిందని తెలిపారు. అలాగే బాల్యవివాహాలను అరికట్టడం, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, అసమానతలు, అంటరానితనం, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు విశేషంగా కృషి చేసిందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. చివరికి ప్లేగు వ్యాధితో బాధపడుతున్నవారికి సేవ చేస్తూ అదే వ్యాధితో ఆమె మరణించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం అమర్నాథ్‌తో పాటు ఉపాధ్యాయులు నాగమల్లిక, మనోహర్, రామాంజులు, ప్రేమకుమార్, భాస్కర్, శ్రీనివాసులు, ప్రసూన మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube