BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

శ్రీశైల దేవస్థానం ఆలయం ప్రాంగణంలో వీరభద్రస్వామికి విశేష పూజలు

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 08:17 PM
21 వీక్షణలు

ఆలయ ప్రాంగణములోని  వీరభద్రస్వామికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

తేది:  08.04.2026

లోకకల్యాణం కోసం దేవస్థానం బుధవారం (08.04.2026) సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహిస్తోంది. 

ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది. 

కాగా ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేషఅభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది. 

ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది. 

కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను నిర్వహించబడుతుంది.

తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపించబడుతుంది.

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ