SIR మ్యాపింగ్పై అపోహలు తొలగించాలి
తహసీల్దార్కు వినతిపత్రం
SIR మ్యాపింగ్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, నాలుగో వార్డు ప్రజలకు మరియు మైనార్టీ వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ మైనార్టీ నాయకులు యాకూబ్ పాషా, జామా మజీద్ మౌజన్ అబ్దుల్ సత్తార్ శనివారం నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాముకు నాలుగో వార్డ్ఆఫీసులోవినతిపత్రం అందజేశారు.
వారి వినతిపై వెంటనే స్పందించిన కౌన్సిలర్ మెరుగు రాము,మరిపెడ తహసీల్దార్కువినతిపత్రంసమర్పించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR మ్యాపింగ్ ప్రక్రియలో ప్రజల ఓటు హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.నాలుగో వార్డుకుచెందినBLOలనుపిలిపించి,వారి ద్వారా SIR మ్యాపింగ్పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్నుకోరినట్లుతెలిపారు.ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, రామగిరి సత్యనారాయణ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.