www.ntodaynews.com
శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత
తెలంగాణ
చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు ఉదయం గం. 6.00ల నుండి ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి.
ముఖ్య వివరాలు
చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6.00 గంటల నుంచి ఆలయం మూసివేత.
రాత్రి 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాదికార్యక్రమాలు నిర్వహణ.
రాత్రి 9.00 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు.
మహామంగళహారతుల అనంతరం రాత్రి 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించబడుతుంది.
ఇదే రోజు ఉదయం 3.00 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతులు నిర్వహించబడినాయి. ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు అలంకార దర్శనం కల్పించబడింది.
గ్రహణం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయాలు, సాక్షిగణపతి, హాఠకేశ్వరం – ఫాలధార పంచధార, శిఖరేశ్వరం తదితర ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి.
అలాగే ఈ రోజు అన్నప్రసాదవితరణ నిలిపివేయబడింది.
(కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ
#Srisailam #LunarEclipse #TempleUpdate #DevotionalNews #AndhraPradesh
Follow us on
Website
Facebook
Instagram
YouTube