BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ఘనంగా సెయింట్ థెరిసా మహిళా కళాశాల 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

తెలంగాణ
10 Jul, 2025 - 08:49 AM
146 వీక్షణలు
ఘనంగా సెయింట్ థెరిసా మహిళా కళాశాల 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, సాధించిన ఘనతకై విజయాలు జరుపుకోవాలన్నారు మదర్ ఆర్నెస్టైన్ ఫెర్నాండెజ్. స్థానిక సెయింట్ థెరిసా మహిళా కళాశాలలో జరిగిన 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఆర్నెస్టైన్ ఫెర్నాండెజ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులను విద్యారంగంలో రాణింపజేసి మహిళా సాధికారత వైపు నడిపించడానికి తమ కళాశాల ఏడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నదని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ తమ కళాశాల ఏడు దశాబ్దాలుగా అనేక రంగాలలో ఉత్తమ కళాశాలగా ఎంపికైందని ఈ విజయాల వెనుక కళాశాల యాజమాన్య అధ్యాపకుల విద్యార్థినుల కృషి ఉన్నదని తెలియజేశారు. అనంతరం కళాశాల ఏడు దశాబ్దాల చరిత్రలో సాధించిన విజయాలను, అందుకున్న అవార్డులను గురించి సభకు పవర్ పాయింట్ ద్వారా పరిచయం చేశారు. కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏలూరు డయాసిస్ కి చెందిన ఫాదర్ బి రాజు దివ్య బలి పూజ సమర్పించారు. ఇంటర్మీడియట్ విభాగంలో నీ సంఘ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించామన్నారు. కళాశాల ఇంటర్మీడియట్ విభాగం నుంచి ప్రెసిడెంట్ గాఎం. దుర్గ భవాని, వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ సమీరా, సెక్రటరీగా ఎం విన్నీ, జాయింట్ సెక్రటరీగా షేక్ రిజ్వానా, ట్రెజరర్ గా పి పూజ శ్రీ, లీడర్ గా బి జాస్మిన్ ఎన్నికయ్యారని తెలియజేశారు. ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రతినిధులకు కాసాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలోఇంటర్మీడియట్ విద్యార్థుల ఎన్నికలను మ్యాథమెటిక్స్ విభాగం వారు నిర్వహించగా, వ్యవస్థాపక దినోత్సవాన్ని హోమ్ సైన్స్ విభాగం వారు నిర్వహించారు. Follow us on Website Facebook Instagram YouTube