BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఘనంగా సెయింట్ థెరిసా మహిళా కళాశాల 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

తెలంగాణ
10 Jul, 2025 - 08:49 AM
215 వీక్షణలు
ఘనంగా సెయింట్ థెరిసా మహిళా కళాశాల 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, సాధించిన ఘనతకై విజయాలు జరుపుకోవాలన్నారు మదర్ ఆర్నెస్టైన్ ఫెర్నాండెజ్. స్థానిక సెయింట్ థెరిసా మహిళా కళాశాలలో జరిగిన 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఆర్నెస్టైన్ ఫెర్నాండెజ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులను విద్యారంగంలో రాణింపజేసి మహిళా సాధికారత వైపు నడిపించడానికి తమ కళాశాల ఏడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నదని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ తమ కళాశాల ఏడు దశాబ్దాలుగా అనేక రంగాలలో ఉత్తమ కళాశాలగా ఎంపికైందని ఈ విజయాల వెనుక కళాశాల యాజమాన్య అధ్యాపకుల విద్యార్థినుల కృషి ఉన్నదని తెలియజేశారు. అనంతరం కళాశాల ఏడు దశాబ్దాల చరిత్రలో సాధించిన విజయాలను, అందుకున్న అవార్డులను గురించి సభకు పవర్ పాయింట్ ద్వారా పరిచయం చేశారు. కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏలూరు డయాసిస్ కి చెందిన ఫాదర్ బి రాజు దివ్య బలి పూజ సమర్పించారు. ఇంటర్మీడియట్ విభాగంలో నీ సంఘ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించామన్నారు. కళాశాల ఇంటర్మీడియట్ విభాగం నుంచి ప్రెసిడెంట్ గాఎం. దుర్గ భవాని, వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ సమీరా, సెక్రటరీగా ఎం విన్నీ, జాయింట్ సెక్రటరీగా షేక్ రిజ్వానా, ట్రెజరర్ గా పి పూజ శ్రీ, లీడర్ గా బి జాస్మిన్ ఎన్నికయ్యారని తెలియజేశారు. ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రతినిధులకు కాసాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలోఇంటర్మీడియట్ విద్యార్థుల ఎన్నికలను మ్యాథమెటిక్స్ విభాగం వారు నిర్వహించగా, వ్యవస్థాపక దినోత్సవాన్ని హోమ్ సైన్స్ విభాగం వారు నిర్వహించారు. Follow us on Website Facebook Instagram YouTube