BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

గోదావరిఖనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు

తెలంగాణ
10 Jan, 2026 - 06:28 AM
164 వీక్షణలు
మంత్రుల బహిరంగ సభ నేపథ్యంలో గోదావరిఖనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ NTODAY NEWS: గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా రేపు (తేదీ: 11-01-2026) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభకు ఐటీ శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి శ్రీ రాజ్యలక్ష్మి గార్డెన్స్, మార్కండేయ కాలనీలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, సభా ప్రాంగణంలోని వేదిక, పబ్లిక్ గ్యాలరీ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు, వీఐపీ మరియు పబ్లిక్ వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, భోజనాల ఏర్పాట్ల ప్రాంతం తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, లింగమూర్తి, మంథని సీఐ బి. రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, ఆర్‌ఐ దామోదర్, శ్రీనివాస్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube