టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం
షేక్ కరిముల్లాకు ఘన సన్మానం
టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లాను మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ నియామకం ప్రత్తిపాటి ఆదేశాలతో, నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ఆశీస్సులతో జరిగింది.
ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, సభ్యులు పాల్గొని కరిముల్లాకు అభినందనలు తెలిపారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో, కష్టపడి నిర్వర్తిస్తూ ఎన్నో సవాళ్లను అధిగమించి విజయాలు సాధించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో తనదైన శైలితో టిడిపి నాయకుడిగా ప్రత్యేక ముద్ర వేసుకుని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కరిముల్లాకు ఈ పదవి దక్కడం ఆనందదాయకమని తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
మార్కెట్ యార్డ్ సెక్రటరీ తిరుమల రాయుడు మాట్లాడుతూ, కరిముల్లా నాయకత్వం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.