BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.60.61 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
11 వీక్షణలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం మొత్తం రూ.60.61 లక్షల విరాళాలు అందాయి. పలువురు దాతలు, సంస్థలు భక్తిశ్రద్ధలతో ఈ విరాళాలను సమర్పించారు.

విశాఖపట్నానికి చెందిన ఎస్ఎస్ఎన్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10.50 లక్షలు, విశ్వ సి.వి. చెరుకూరి రూ.10 లక్షలు, వంత ఇన్‌ఫ్రా కాన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షలు, వెర్టెక్స్ కౌంటీ ఎల్‌ఎల్‌పీ రూ.10 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన సాయిలీల ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షలు, అమరావతి తుళ్లూరుకు చెందిన జొన్నలగడ్డ కిరణ్ కుమార్ రూ.10,11,116ను విరాళంగా అందజేశారు.

దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు విరాళాల డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, షాప్ చైర్మన్ రవి నాయుడుతో పాటు ఇతర అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.