టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.60.61 లక్షల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం మొత్తం రూ.60.61 లక్షల విరాళాలు అందాయి. పలువురు దాతలు, సంస్థలు భక్తిశ్రద్ధలతో ఈ విరాళాలను సమర్పించారు.
విశాఖపట్నానికి చెందిన ఎస్ఎస్ఎన్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10.50 లక్షలు, విశ్వ సి.వి. చెరుకూరి రూ.10 లక్షలు, వంత ఇన్ఫ్రా కాన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షలు, వెర్టెక్స్ కౌంటీ ఎల్ఎల్పీ రూ.10 లక్షలు, హైదరాబాద్కు చెందిన సాయిలీల ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షలు, అమరావతి తుళ్లూరుకు చెందిన జొన్నలగడ్డ కిరణ్ కుమార్ రూ.10,11,116ను విరాళంగా అందజేశారు.
దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు విరాళాల డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, షాప్ చైర్మన్ రవి నాయుడుతో పాటు ఇతర అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.