BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:28 AM
110 వీక్షణలు

​తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు : రూ.44 వేల కోట్ల భారీ ఆదాయం 

తెలంగాణ రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాలు కాసుల వర్షం కురిపించాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.44,557 కోట్ల భారీ ఆదాయాన్ని గడించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయంలో 7% వృద్ధి నమోదు కావడం విశేషం.

​ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం. ​ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఈ భారీ ఆదాయంలో  నేరుగా మద్యం అమ్మకాల ద్వారా రూ.39,368 కోట్లు సమకూరాయి. కొత్త దుకాణాల దరఖాస్తు రుసుము, వైన్స్ మరియు బార్ల వార్షిక అద్దె ద్వారా మరో రూ.5,189 కోట్ల ఆదాయం లభించింది. కేవలం డిసెంబర్ నెలలోనే పండుగలు, న్యూ ఇయర్ వేడుకల పుణ్యమా అని రూ.5,051 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.  ​గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎక్సైజ్ శాఖకు రూ.40,209 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా రూ.44,557 కోట్లకు చేరుకుంది. పకడ్బందీ నిఘా, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధ్యమైందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ​రాష్ట్ర ఆదాయ వనరుల్లో ఎక్సైజ్ శాఖ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండగా, ఈ ఏడాది వచ్చిన రికార్డు స్థాయి వసూళ్లు ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చాయి.