BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

తెలంగాణ జాగృతిలో చేరిన సీనియర్ నాయకులు మేడి నరేష్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 11:39 AM
189 వీక్షణలు
తెలంగాణ జాగృతిలో చేరిన సీనియర్ నాయకులు మేడి నరేష్

హైదరాబాద్: తెలంగాణ జాగృతి పక్షాన కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది. సీనియర్ రాజకీయ నాయకులు, దళిత్ జస్టిస్ ఫోరమ్ చైర్మన్ మేడి నరేష్ గురువారం తన అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. కవిత వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనుభవం కలిగిన నాయకత్వం:

గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం మేడి నరేష్‌కు ఉంది. ప్రస్తుతం ఆయన 9tv మీడియా మరియు ప్రజా ఘర్షణ పత్రికల చీఫ్ ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఆయన, ఇప్పుడు జాగృతి బలోపేతానికి నడుం బిగించారు.

కవితమ్మను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం:

ఈ సందర్భంగా మేడి నరేష్ మాట్లాడుతూ.. తన రాజకీయ అనుభవంతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కల్వకుంట్ల కవితను తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు కవితకు, మేడి రాజశేఖర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్య నేతల చేరిక:

మేడి నరేష్‌తో పాటు తెలంగాణ మాధవక్క, లింగగల్ల నర్సింలు, సీమ అంజయ్య, బతుకమ్మ పార్టీ కందాటి మణిపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, డి. నర్సింహా, ఎం. సురేష్, గాలి రవీందర్, చంద్రం వంటి పలువురు సీనియర్ ఉద్యమ నాయకులు పార్టీలో చేరారు.

​ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, బొల్లంపల్లి సందీప్, HMS రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సారయ్య, నాయకులు హైద ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.