BREAKING
కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్!
www.ntodaynews.com

తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 08:41 AM
27 వీక్షణలు

తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు  పునరావాసంలో భాగంగా ఉపాధి అవకాశాలు కల్పించింది. పర్యాటక శాఖలో ‘గిరిదర్శక్ గైడ్స్’గా వారికి ఉద్యోగాలు ఇచ్చింది. ప్రత్యేక నిఘా బ్యూరో మరియు పర్యాటక శాఖ సంయుక్తంగా వారికి ఒక నెలపాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించాయి.

శిక్షణ పూర్తిచేసుకున్న ఈ అభ్యర్థులు తాజాగా విధుల్లో చేరారు. వీరు భద్రాచలం, ములుగు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాల్లో గైడ్లుగా సేవలు అందించనున్నారు. పర్యాటకులకు ప్రాంతీయ చరిత్ర, ప్రకృతి విశేషాలు వివరించే బాధ్యతలు వీరికి అప్పగించబడ్డాయి.

ఇదిలా ఉండగా, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నగదు సహాయం, పునరావాస సదుపాయాలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా ప్రధాన ప్రవాహంలోకి వారిని తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.