BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 01:52 PM
121 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త – నారా లోకేష్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందింది. నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. లక్షలాది మంది ఆధారపడే గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ సేవలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయని తెలిపారు.

దశాబ్దాలుగా పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. పేదల ఇళ్లలో అభివృద్ధి, నిరుపేద పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందిస్తూ సంస్థ చేస్తున్న సేవలను వివరించినట్లు చెప్పారు.

ఇటీవల ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయని, విదేశీ నిధుల నియంత్రణ చట్టం ప్రకారం ట్రస్ట్‌కు పునరుద్ధరణ మంజూరైనట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ట్రస్ట్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మాంచో ఫెర్రర్‌కు అభినందనలు తెలియజేశారు.

 ఈ నిర్ణయంతో లక్షలాది పేద కుటుంబాలు, విద్యార్థులు, లబ్ధిదారులు ఉపశమనం పొందనున్నారు.