తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త – నారా లోకేష్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందింది. నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. లక్షలాది మంది ఆధారపడే గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ సేవలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయని తెలిపారు.
దశాబ్దాలుగా పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. పేదల ఇళ్లలో అభివృద్ధి, నిరుపేద పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందిస్తూ సంస్థ చేస్తున్న సేవలను వివరించినట్లు చెప్పారు.
ఇటీవల ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయని, విదేశీ నిధుల నియంత్రణ చట్టం ప్రకారం ట్రస్ట్కు పునరుద్ధరణ మంజూరైనట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ట్రస్ట్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మాంచో ఫెర్రర్కు అభినందనలు తెలియజేశారు.
ఈ నిర్ణయంతో లక్షలాది పేద కుటుంబాలు, విద్యార్థులు, లబ్ధిదారులు ఉపశమనం పొందనున్నారు.