తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త NTODAY NEWS హైదరాబాద్
భారత రైల్వే నూతన వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులు ప్రారంభం
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ కొత్త వీక్లీ టైన్ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.