BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తల్లిపాలే శిశువులకు శ్రీరామరక్ష

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
15 Apr, 2026 - 07:12 PM
168 వీక్షణలు

తల్లిపాలే శిశువులకు శ్రీరామరక్ష   NTODAY NEWS చిట్యాల 

పెదకాపర్తిలో 8వ పోషణ్ పక్షోత్సవాలు.

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పెద్ధకాపర్తి గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రంలో 8వ పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం 'పోషణ్ పక్షం-2026' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ మునుగోడు ప్రాజెక్ట్ ఏసీడీపీఓ వెంకటమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు చిన్న పిల్లల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహార విలువలు, మరియు పిల్లల మెదడు అభివృద్ధిపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు.  పిల్లల్లో మొబైల్ వినియోగాన్ని తగ్గించేందుకు 'నో స్క్రీన్ అవర్' మరియు 'స్మైల్ టైమ్' గురించి వివరించారు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మరియు పిల్లల ఎదుగుదలపై తల్లులకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలపై ప్రదర్శన నిర్వహించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ఎం. సుజాత, బి. గీత, పి. సత్యవతి, ఆయాలు మమత, అనసూయతో పాటు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.