BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

తండ్రిని కొరియర్ చేయాలా? సమాజాన్ని కలచివేసిన ఘటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:16 AM
247 వీక్షణలు

తండ్రిని కొరియర్ చేయాలా?  సమాజాన్ని కలచివేసిన ఘటన

బెంగళూరు, మార్చి 21: నగరంలోని వినాయక సర్కిల్ పరిధిలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. బస్సు ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో నిరసనగా ఒక కుటుంబం తమ వృద్ధ తండ్రిని మంగళూరుకు పంపేందుకు కొరియర్ సేవలను ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

వ్యాలీకావల్ ప్రాంతంలోని ఒక కొరియర్ కార్యాలయానికి వెళ్లిన కుటుంబ సభ్యులు గోనె సంచిలో ఉన్న పెద్ద ప్యాకేజీని పంపాలని సిబ్బందిని కోరారు. అనుమానం వచ్చిన సిబ్బంది సంచిని విప్పి చూడగా అందులో ఒక వృద్ధుడు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. సమస్యల పరిష్కారానికి ఇలాంటి అవమానకరమైన మార్గాలు ఎంచుకోవడం సమాజానికి మంచిది కాదని పెద్దలు సూచిస్తున్నారు.

పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.