www.ntodaynews.com
తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవం 25న
జాతీయం
తుంగభద్ర డ్యామ్కు అమర్చిన నూతన గేట్లను ఈ నెల 25న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ హాజరుకానున్నారు.
రెండేళ్ల క్రితం భారీ నీటి ప్రవాహానికి డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో, నిపుణుల సూచనల మేరకు అధికారులు మొత్తం 33 గేట్లు, చైన్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. తుంగభద్ర డ్యామ్ ఆధునీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి.
డ్యామ్కు కొత్త గేట్ల ఏర్పాటు కోసం అవసరమైన నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చింది. నూతన గేట్ల ప్రారంభంతో తుంగభద్ర జలాశయం భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.