మైలార్ దేవ్పల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ
2000–2001 పదవ తరగతి బ్యాచ్
NTODAY NEWS: ఎల్బీ నగర్ రిపోర్టర్ పగడాల దేవయ్య
డిసెంబర్ 28న మైలార్ దేవ్పల్లిలో 2000–2001 విద్యా సంవత్సరం పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి గెట్టుగెదర్లో పాల్గొని తమ విద్యాభ్యాస కాలంలోని మధుర జ్ఞాపకాలను తలచుకున్నారు. తమకు విద్యాబోధన చేసిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను ఆహ్వానించి, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. చిన్ననాటి అల్లర్లు, పాఠశాల రోజుల్లోని తీపి అనుభవాలను గుర్తు చేసుకుంటూ పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం అందరూ కలిసి భోజనాలు స్వీకరించి, స్నేహబంధాలను మరింత బలపరిచుకున్నారు. ఈ సమ్మేళనం పూర్వ విద్యార్థుల్లో ఆనందం, ఆత్మీయతను నింపింది.
Follow us on
Website
Facebook
Instagram
YouTube