www.ntodaynews.com
ఆకతాయిల ఆటలకు ఇక చెల్లు
తెలంగాణ
ఆకతాయిల ఆటలకు ఇక చెల్లు
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా పుంగనూరును ప్రశాంతంగా ఉంచేందుకు కఠిన చర్యలు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ మహేంద్ర సూచనలతో పుంగనూరులో ప్రత్యేక పోలీస్ నిఘా చేపట్టారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలు విడిచే సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మాదకద్రవ్యాల విక్రయాలు, ఆకతాయిల వేధింపులు (ఈవ్ టీజింగ్), గొడవలు వంటి ఘటనలు జరగకుండా విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఇకపై ఉపేక్షించబోమని సీఐ సుబ్బారాయుడు స్పష్టం చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube