www.ntodaynews.com
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరు
తెలంగాణ
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరు
జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున దావ వసంత, రాజేశం గౌడ్ ముమ్మర ప్రచారం
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 42వ, 49వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులు ఎలామాద్రి కిషోర్, శ్రీపాద సంతోష్లకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు.
పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#BRS
#MunicipalElections
#Jagtial
#CarSymbol
#ElectionCampaign
#TelanganaPolitics
#LocalBodyElections
Follow us on
Website
Facebook
Instagram
YouTube