BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

తెలంగాణ
27 Jan, 2026 - 10:10 PM
193 వీక్షణలు
సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు NTODAY NEWS: హైదరాబాద్ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ మహాజాతరను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పండుగను వనదేవతల మహోత్సవంగా నిర్వహించాలన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా భారీ నిధులు కేటాయించి మేడారం ఆలయాన్ని పునర్నిర్మించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రూ.250 కోట్ల వ్యయంతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను విశాలంగా నిర్మించినట్లు తెలిపారు. గిరిజన ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, నలుదిశలా తోరణాలు నిర్మించామని పేర్కొన్నారు. లక్షలాదిగా నిరంతరం మేడారానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని తెలిపారు. మేడారం తల్లుల స్ఫూర్తితో సాగిన ప్రజాస్వామ్య పోరాట ఫలితంగానే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సమ్మక్క–సారలమ్మ చెంత మంత్రివర్గ సమావేశం నిర్వహించామని తెలిపారు. జనంకోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చిన వనదేవతల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని అన్నారు. మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి ఫోన్ ద్వారా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు నిర్విరామంగా అందుబాటులో ఉండి జాతరను వైభవంగా నిర్వహించాలని సూచించారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు భక్తిశ్రద్ధలతో వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. #MedaramJatara #SammakkaSaralamma #TribalFestival #TelanganaCulture #MedaramMahajathara #CMTelangana #NtodayNews #IndianTraditions Follow us on Website Facebook Instagram YouTube