BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

తెలంగాణ
30 Jan, 2026 - 10:23 AM
169 వీక్షణలు
ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ కావాలి NTODAY NEWS: ధర్మపురి  ధర్మపురి పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసిన మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధే కాంగ్రెస్ నినాదం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లలో ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణాన్ని మరింత సుందరంగా, సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలన అవసరమని అన్నారు. 15 వార్డులలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాలను మంత్రి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్‌లోకి యువ నాయకుల చేరిక మంత్రి సమక్షంలో ధర్మపురి పట్టణానికి చెందిన ఒడ్డెర యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఓల్లెపు శంకర్ రాజుతో పాటు పలువురు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒడ్డెర యువజన సంఘం మండల అధ్యక్షుడు తాపళ్ల శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ రాజు, సంపంగి రవి, ఉప్పుల శివ, దండ్ల రాజేష్, సంపంగి శేఖర్, సంపంగి సంజీవ్ తదితరులకు మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #CongressParty #MunicipalElections #Dharmapuri #AdluriLaxmanKumar #CongressCampaign #UrbanDevelopment #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube