BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ధర్మపురి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ అడుగులు

తెలంగాణ
06 Feb, 2026 - 08:12 AM
148 వీక్షణలు
ధర్మపురి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ అడుగులు అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 6, 7వ వార్డుల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ (కమలాపూర్ రోడ్)లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార సభలో మంత్రి మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అలాగే, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేద కుటుంబాలకు ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ ఆర్థిక భారం తగ్గిస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ పాలనతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముడేళ్ళల్లో పట్టణ రూపురేఖలు మారుస్తాం ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, రాబోయే మూడేళ్లలో పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం నిరుద్యోగులు, మహిళలకు సంక్షేమ శాఖ ద్వారా రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. #DharampuriDevelopment #CongressCampaign #MunicipalElections #PublicWelfare #TelanganaPolitics #ElectionNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube