పుంగనూరులో నిరంతర అన్నదానం విజయవంతంగా ముగింపు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది.
అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 41 రోజులపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ సందర్భంగా గురుస్వామి సుబ్బన్న స్వామి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షా కాలంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. నిత్యం వందలాది స్వాములు, భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు.
భక్తులు మరియు ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి, గురుస్వామి గోవిందు, సుబ్రి, పిచ్చండి, అభినయ రెడ్డి, హరి, రవి అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube