BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి

తెలంగాణ
03 Jan, 2026 - 09:17 AM
252 వీక్షణలు

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

NTODAY NEWS:కొండగట్టు ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తన ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంను దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిపూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం, రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానాలు సహకారంతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఈ పర్యటన జరిగింది.ఉదయం 11 గంటల ప్రాంతంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పవన్ కళ్యాణ్ ఆలయానికి చేరుకున్నారు. తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యుడు కపీంద్ర స్వామి సంప్రదాయబద్ధంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి ఇరువైపులా ఉన్న వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదం ఇచ్చారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో టి. శ్రీకాంతరావులు స్వామివారి చిత్రపటాన్ని పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. ఈ పర్యటనలో టీటీడీ బోర్డు సభ్యుడు బి. ఆనందసాయి, తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవింద్ హరే, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఆర్.కె. సాగర్ తదితరులు కూడా ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube