BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడు అరెస్ట్

తెలంగాణ
10 Jan, 2026 - 10:06 AM
329 వీక్షణలు

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడు అరెస్ట్

ఈగల్ టీం సహకారంతో చిట్యాల పోలీసులు దాడి – 9 కిలోల ఓపియం స్వాధీనం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులోని ఒక ధాబాలో నిషేధిత మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడిని చిట్యాల పోలీసులు ఈగల్ టీం సహాయంతో అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 9 కిలోల ఓపియం (పాపి హస్క్)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారి–65పై చిట్యాల పట్టణ శివారులో ఉన్న డూన్ పంజాబీ ధాబాలో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌కు చెందిన గుర్నిత్ సింగ్ గత కొంతకాలంగా నిషేధిత ఓపియం పాపి హస్క్‌ను కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి సుమారు 10 గంటలకు ధాబాపై దాడి చేశారు. ఈ దాడిలో గుర్నిత్ సింగ్ వాహనదారులకు ఓపియం విక్రయిస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. విచారణలో నిందితుడు, జాతీయ రహదారిపై వెళ్లే లారీ డ్రైవర్ల నుంచి ఒక్క కిలో ఓపియాన్ని రూ.1,800కు కొనుగోలు చేసి, దానిని రూ.6,000కు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇటీవల 10 కిలోల ఓపియం కొనుగోలు చేసి, అందులో సుమారు ఒక కిలో విక్రయించి, మిగిలిన 9 కిలోలను ధాబాలోని తన గదిలో దాచినట్లు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.54,000 నగదు, 9 కిలోల ఓపియం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిని డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కే. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవంతమైన ఆపరేషన్‌కు పాల్పడిన ఎస్‌ఐ మామిడి రవికుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: డీఎస్పీ శివరాం రెడ్డి మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం చేసే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని డీఎస్పీ స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే 100 నంబర్‌కు లేదా 8712670266కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో నార్కెట్పల్లి సీఐ కే. నాగరాజు, చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్, మునుగోడు ఎస్‌ఐ ఇరిగి రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube