BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడు అరెస్ట్

తెలంగాణ
10 Jan, 2026 - 10:06 AM
262 వీక్షణలు

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడు అరెస్ట్

ఈగల్ టీం సహకారంతో చిట్యాల పోలీసులు దాడి – 9 కిలోల ఓపియం స్వాధీనం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులోని ఒక ధాబాలో నిషేధిత మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడిని చిట్యాల పోలీసులు ఈగల్ టీం సహాయంతో అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 9 కిలోల ఓపియం (పాపి హస్క్)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారి–65పై చిట్యాల పట్టణ శివారులో ఉన్న డూన్ పంజాబీ ధాబాలో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌కు చెందిన గుర్నిత్ సింగ్ గత కొంతకాలంగా నిషేధిత ఓపియం పాపి హస్క్‌ను కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి సుమారు 10 గంటలకు ధాబాపై దాడి చేశారు. ఈ దాడిలో గుర్నిత్ సింగ్ వాహనదారులకు ఓపియం విక్రయిస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. విచారణలో నిందితుడు, జాతీయ రహదారిపై వెళ్లే లారీ డ్రైవర్ల నుంచి ఒక్క కిలో ఓపియాన్ని రూ.1,800కు కొనుగోలు చేసి, దానిని రూ.6,000కు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇటీవల 10 కిలోల ఓపియం కొనుగోలు చేసి, అందులో సుమారు ఒక కిలో విక్రయించి, మిగిలిన 9 కిలోలను ధాబాలోని తన గదిలో దాచినట్లు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.54,000 నగదు, 9 కిలోల ఓపియం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిని డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కే. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవంతమైన ఆపరేషన్‌కు పాల్పడిన ఎస్‌ఐ మామిడి రవికుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: డీఎస్పీ శివరాం రెడ్డి మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం చేసే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని డీఎస్పీ స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే 100 నంబర్‌కు లేదా 8712670266కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో నార్కెట్పల్లి సీఐ కే. నాగరాజు, చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్, మునుగోడు ఎస్‌ఐ ఇరిగి రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube