
లోత్తునూర్ గ్రామ పంచాయతీలో ఘనంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్
గొల్లపల్లి మండల పరిధిలోని లోత్తునూర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పథకం విశేషాలు
మహిళల గౌరవం, సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులే కాకుండా, 18 ఏళ్లు నిండిన అర్హులైన అన్ని మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ మాట్లాడుతూ, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హురాలికి ఈ పథక ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒరగంటి మల్లేశం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి, అలాగే పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube