రేపటి నుండి రెండవ విడత నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల సంఘం ఆదేశాలను తూ. చా తప్పకుండా పాటించాలి--జిల్లా కలెక్టర్
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు జరిగే రెండవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాలకు సంబంధించిన 150 గ్రామ పంచాయతీలు, 1332 వార్డులకు జరిగే రెండవ విడత నామినేషన్ ప్రక్రియ కి సంబందించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారన్నారని తెలిపారు.నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటుమూసివేయాలని, నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణ లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించరని తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube