www.ntodaynews.com
చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రి
తెలంగాణ
మారేడుపల్లిలో చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
NTODAY NEWS: ఎండపల్లి ఎండపల్లి మండల పరిధిలోని మారేడుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహమ్మద్ రహీం కుమార్తె నామకరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన చిన్నారికి పేరు పెట్టి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రహీం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. మాజీ మంత్రి రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన నాయకులు చిన్నారికి ఆశీస్సులు అందజేయడంతో పాటు, పార్టీ బలోపేతంపై కొప్పుల ఈశ్వర్తో స్థానిక నాయకులు చర్చించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube