www.ntodaynews.com
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం
-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జగిత్యాల, రాయికల్ పట్టణాలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కదలాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.
ప్రజాబలంతో ప్రలోభాలను ఎదుర్కోవాలి
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ— అధికార పార్టీకి ధనబలం, అధికార బలం ఉండవచ్చని, కానీ బీఆర్ఎస్కు అజేయమైన ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాయని, ప్రజల మనసుల్లో కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ మారే వారి గురించి ఆందోళన అవసరం లేదని, బీఆర్ఎస్ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ అని, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు.
జగిత్యాల అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే
2016లో జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజీతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని నేతలు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి, జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ సత్తా చాటి ఆ విజయాలను కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
హాజరైన ప్రముఖులు
ఈ సమావేశంలో డా. సంజయ్ కుమార్, ఎల్. రమణ, రాజేశం గౌడ్, దావ వసంత సురేష్, రాష్ట్ర నాయకుడు ఓరుగంటి రమణారావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, అలాగే రెండు మున్సిపాలిటీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#MunicipalElections
#BRSParty
#Jagtial
#Raikal
#PeoplePower
#LocalElections
#PoliticalMobilization
Follow us on
Website
Facebook
Instagram
YouTube 