BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నిజానిజాలు ప్రభుత్వం వెంటనే ప్రజలకు తెలియజేయాలి

తెలంగాణ
29 Mar, 2025 - 01:14 AM
379 వీక్షణలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అదనపు కార్యదర్శి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి క్రిస్టర్ విజ్ఞప్తి. చిలకలూరిపేట శాంతినిలయం చర్చ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అదనపు కార్యదర్శి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి క్రిస్టర్ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు వెల్లడించాలని కోరారు.  చిలకలూరిపేట నియోజకవర్గ క్రైస్తవ నాయకులు అంతా పాల్గొన్న ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ  మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని, అసత్య ప్రచారాలు చేసేవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అలాగే ప్రజలు, క్రైస్తవ సమాజము సంయమనం పాటించాలని, ఉద్రేకాలకు లోను కాకూడదని విజ్ఞప్తి చేశారు.  పోలీసుశాఖ  వారి విచారణ రిపోర్ట్ వచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుందని వారు వెల్లడించారు. ఈసమావేశంలో  సామాజికవేత్త  శ్రీ చుక్కా విన్సెంట్ పాల్ మాట్లాడుతూ  కుల మతాలకు అతీతంగా న్యాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యం అని గుర్తు చేశారు.  చిలకలూరిపేట లోక్సత్తా కన్వీనర్ శ్రీ భాను ప్రసాద్ మాట్లాడుతూ  భారతదేశం టెక్నాలజీ రంగంలో ముందు ఉండగా ఈ కేసు లో సత్వర విచారణ అసాధ్యమేమీ కాదని, వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా న్యాయం చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా అడ్మినిస్ట్రేటర్ బ్రదర్ చక్రవర్తి, జిల్లా ట్రెజరర్ బ్రదర్ రత్నకుమార్,  చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జి పాస్టర్ ఎలీషా, చిలకలూరిపేట యు పి ఎఫ్ అధ్యక్షుడు పాస్టర్ బుజ్జి,  బాప్టిస్ట్ ఫీల్డ్ అధ్యక్షుడు పాస్టర్  శిఖామణి,   ఐపీఎఫ్ అధ్యక్షుడు పాస్టర్ చార్లెస్, ఎడ్లపాడు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు జీవన్ పాల్ పాల్గొన్నారు