BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నిజానిజాలు ప్రభుత్వం వెంటనే ప్రజలకు తెలియజేయాలి

తెలంగాణ
29 Mar, 2025 - 01:14 AM
273 వీక్షణలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అదనపు కార్యదర్శి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి క్రిస్టర్ విజ్ఞప్తి. చిలకలూరిపేట శాంతినిలయం చర్చ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అదనపు కార్యదర్శి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి క్రిస్టర్ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు వెల్లడించాలని కోరారు.  చిలకలూరిపేట నియోజకవర్గ క్రైస్తవ నాయకులు అంతా పాల్గొన్న ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ  మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని, అసత్య ప్రచారాలు చేసేవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అలాగే ప్రజలు, క్రైస్తవ సమాజము సంయమనం పాటించాలని, ఉద్రేకాలకు లోను కాకూడదని విజ్ఞప్తి చేశారు.  పోలీసుశాఖ  వారి విచారణ రిపోర్ట్ వచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుందని వారు వెల్లడించారు. ఈసమావేశంలో  సామాజికవేత్త  శ్రీ చుక్కా విన్సెంట్ పాల్ మాట్లాడుతూ  కుల మతాలకు అతీతంగా న్యాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యం అని గుర్తు చేశారు.  చిలకలూరిపేట లోక్సత్తా కన్వీనర్ శ్రీ భాను ప్రసాద్ మాట్లాడుతూ  భారతదేశం టెక్నాలజీ రంగంలో ముందు ఉండగా ఈ కేసు లో సత్వర విచారణ అసాధ్యమేమీ కాదని, వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా న్యాయం చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా అడ్మినిస్ట్రేటర్ బ్రదర్ చక్రవర్తి, జిల్లా ట్రెజరర్ బ్రదర్ రత్నకుమార్,  చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జి పాస్టర్ ఎలీషా, చిలకలూరిపేట యు పి ఎఫ్ అధ్యక్షుడు పాస్టర్ బుజ్జి,  బాప్టిస్ట్ ఫీల్డ్ అధ్యక్షుడు పాస్టర్  శిఖామణి,   ఐపీఎఫ్ అధ్యక్షుడు పాస్టర్ చార్లెస్, ఎడ్లపాడు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు జీవన్ పాల్ పాల్గొన్నారు