www.ntodaynews.com
మేడారం జాతరకు గవర్నర్కు ఆహ్వానం
తెలంగాణ
మేడారం జాతరకు గవర్నర్కు ఆహ్వానం
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు.
శుక్రవారం లోక్ భవన్లో గవర్నర్ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడారం జాతర విశిష్టతను వివరించి, ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం జాతర జ్ఞాపికను బహూకరించారు.
కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా జాతరకు గవర్నర్ హాజరు కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుందని మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై కూడా చర్చించారు.
#MedaramJathara
#SammakkaSarakka
#TribalFestival
#TelanganaCulture
#GovernorInvitation
#SocialWelfareMinister
#HyderabadNews
#FolkTraditions
Follow us on
Website
Facebook
Instagram
YouTube