BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చలాన్ల వసూలుపై హైకోర్టు బ్రేక్

తెలంగాణ
20 Jan, 2026 - 05:31 AM
307 వీక్షణలు
పెండింగ్ చలాన్ల వసూలుపై హైకోర్టు కీలక తీర్పు NTODAY NEWS: హైదరాబాద్  వాహనదారులకు ఊరట – ట్రాఫిక్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రహదారులపై తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది. బలవంతపు వసూలు చట్టవిరుద్ధం రోడ్లపై తనిఖీలు చేస్తున్న సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయనే కారణంతో వాహనదారులను బలవంతంగా డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేయకూడదని హైకోర్టు పోలీసులకు స్పష్టంగా ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలు లాక్కోవడం వాహనాలను అక్కడే ఆపివేయడం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసుల విధులు ఇవే పోలీసుల విధులు కేవలం ట్రాఫిక్ నిబంధనల అమలును పర్యవేక్షించడమేనని, పెండింగ్ చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించే అధికారం పోలీసులకు లేదని కోర్టు పేర్కొంది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు వాహనాన్ని ఏదైనా కారణంతో ఆపిన సమయంలో, వాహనదారుడే స్వచ్ఛందంగా పెండింగ్ చలాన్లను చెల్లించడానికి ముందుకు వస్తేనే పోలీసులు డబ్బును వసూలు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనదారుడు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే, అతడిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నోటీసుల ద్వారానే వసూలు చేయాలి పెండింగ్ చలాన్ల వసూలుకు ఒక చట్టబద్ధమైన విధానం ఉందని హైకోర్టు గుర్తు చేసింది. నిబంధనల ప్రకారం కోర్టు నోటీసులు పంపించి, చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే బకాయిలను రాబట్టాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. రోడ్లపై నేరుగా నగదు లేదా డిజిటల్ పేమెంట్ల పేరుతో వసూలు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూలు పేరుతో వాహనదారులను వేధిస్తున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆయన, వాహనాలను అడ్డగించి కీలు లాక్కోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, పోలీసుల తీరును తప్పుబడుతూ ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. వాహనదారులకు ముఖ్య సూచన ఈ తీర్పు ప్రకారం, రోడ్డుపై పెండింగ్ చలాన్ల పేరుతో బలవంతం చేస్తే వాహన కీలు లాక్కుంటే నిర్బంధిస్తే ఇది హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణించవచ్చు. Follow us on Website Facebook Instagram YouTube