www.ntodaynews.com
ఘనంగా పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు
తెలంగాణ
వాసవి కన్యకాపరమేశ్వరి దేవి పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు ఘనంగా
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణ మాఘ శుద్ధ విదియ సందర్భంగా పుంగనూరులో బజారు వీధిలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉదయం వాసవి మాత సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్యవైశ్య పతాక ఆవిష్కరణ చేపట్టారు. ఆలయం నుంచి ఆర్యవైశ్యులు, మహిళలు ర్యాలీగా కోనేటి వద్దకు వెళ్లి గంగాజలాన్ని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా 102 మంది గోత్రీకులు క్షీరాభిషేకం చేయగా, అమ్మవారి మూర్తికి అగ్నిగుండ ప్రవేశం ఘనంగా జరిగింది. విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు, అభిషేక సేవలు, మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కె. బాలసుబ్రమణ్యం, సంఘ సభ్యులు, ఆర్యవైశ్యులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#VasaviKanyakaparameswari
#AtmaDinotsavam
#Punganur
#AryaVaishya
#TempleFestival
#HinduTraditions
#SpiritualCelebration
#CulturalHeritage
Follow us on
Website
Facebook
Instagram
YouTube