BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు క్షేత్రం

తెలంగాణ
14 Feb, 2026 - 08:49 PM
270 వీక్షణలు
శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు క్షేత్రం NTODAY NEWS: నార్కట్‌పల్లి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఉన్న పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా చేరుకున్న భక్తులు శివనామస్మరణతో గుట్టను మారుమోగించారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, అర్ధరాత్రి లింగార్చన సమయంలో మహాభిషేకం, రుద్రపారాయణం, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. దీక్షధారులు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు, యువత, మహిళలు స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు గుట్ట మెట్లపై నడుచుకుంటూ శివనామస్మరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, స్వచ్ఛంద సేవకులు తాగునీరు, ప్రసాదాల పంపిణీ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో భక్తులు ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తి చేసుకున్నారు. వైద్య శిబిరాలు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించారు. మహాశివరాత్రి సందర్భంగా చెరువుగట్టు క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడగా, భక్తుల రద్దీ క్షేత్ర ప్రాధాన్యతను ప్రతిబింబించింది. #Mahashivaratri #Cheruvugattu #Nalgonda #Narketpally #TempleFestival #DevotionalNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube