www.ntodaynews.com
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం: జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణుల సమరశంఖం
NTODAY NEWS: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల ప్రతినిధి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల చెక్కుచెదరని నమ్మకం
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ నాయకత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై అపారమైన నమ్మకం ఉందని అన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని గుర్తు చేశారు. పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
సమన్వయంతో ముందుకు సాగాలి
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని విద్యాసాగర్ రావు కోరారు. వార్డుల వారీగా బాధ్యతలు తీసుకుని, పార్టీ అండగా ఉంటుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిన కృషిని గుర్తు చేస్తూ ప్రతి ఓటరును కలిసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జగిత్యాల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube